'రెండేళ్లలో 24 గంటల కరెంట్ ఇస్తాం'
నిజామాబాద్: రానున్న రెండేళ్లలో తెలంగాణలో 24 గంటలూ కరెంట్ సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో వందల కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నామని చెప్పారు.
హరితహారంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు బాధ్యతగా తీసుకుని మొక్కలు నాటించాలని సూచించారు. ఆక్రమణల విషయంలో అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కాళేశ్వరం నుంచి నిజామాబాద్ జిల్లాకు త్వరలో నీళ్లు అందిస్తామని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తెలిపారు.