ఖమ్మం ఘటనపై సీఎం సీరియస్
హైదరాబాద్: ఖమ్మంలో రైతులకు బేడీలు వేసి, కోర్టుకు తీసుకువచ్చిన ఘటనపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఇందుకు సంబంధించి అడిషనల్ డీసీపీ సాయి కృష్ణ నేతృత్వంలో విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నారు. ఇద్దరు ఏఆర్ ఎస్ఐలు పూర్ణా నాయక్, వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్ వేటు వేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఇదిలా ఉండగా, ఖమ్మం మార్కెట్లో ఆందోళనకు సంబంధించి అరెస్టయి జిల్లా జైలులో ఉన్న పది మంది రైతులు గురువారం సాయంత్రం రిలీజయ్యారు. వారికి రాజకీయ పార్టీల నాయకులు పూలదండలతో స్వాగతం పలికారు. వారి రాకతో కుటుంబసభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది.