మొరాయించిన సీఎం బస్సు

మొరాయించిన సీఎం బస్సు - Sakshi


పెద్దపల్లి (కరీంనగర్): సీఎం కేసీఆర్ బస్సు సాంకేతిక లోపంతో ఆదివారం కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో కాసేపు మొండికేసింది. ‘తెలంగాణ ప్రగతి రథం’ బస్సు స్థానిక ట్రినిటీకళాశాల మైదానానికి చేరుకోవడంతో అందరూ చూద్దామని వచ్చారు.



సాంకేతిక సమస్యంతో అది ముందుకు కదల్లేదు. రూ.5కోట్ల బస్సుకు అప్పుడే రిపేరు మొదలైందా అంటూ అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. సిబ్బంది అరగంటలో సమస్యను సరిచేసి బస్సును బయటికి తీసే ప్రయత్నంలో గోడకు తగిలింది. బహిరంగ సభ ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు బస్సులో ధర్మారం వెళ్లారు.



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top