ఎమ్మెల్యే కుమారుడి రిసెప్షన్కు సీఎం హాజరు
పటాన్చెరు : పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తనయుడి రిసెప్షన్ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్రావు బుధవారం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి కుమారుడు గూడెం విష్ణువర్ధన్రెడ్డికి, సోని ట్రావెల్స్ పార్టనర్ సోలిపురం రాంరెడ్డి కుమార్తె కిరణ్మయితో ఈ నెల 3న హైటెక్స్లో వివాహం జరిగింది. అయితే హైదరాబాద్ మియాపూర్లోని నరేన్ గార్డెన్స్లో బుధవారం రిసెప్షన్ కార్యక్రమం నిర్వహించగా సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు మహమూద్ అలీ, నాయిని నరసింహారెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్సీ వీ భూపాల్రెడ్డి, ఎమ్మెల్యే, సినీ న టుడు బాబూ మోహన్ ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
సంబంధిత వార్తలు