ఎన్‌కౌంటర్‌పై ‘సిట్’ విచారణ


ఆలేరు :  ఆలేరు మండల పరిధి కందిగడ్డతండా శివారులలో గత  నెల 7వ తేదీన జరిగిన తీవ్రవాది వికారుద్దీన్ అతని అనుచరుల ఎన్‌కౌంటర్‌పై బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సిట్ (పత్యేక విచారణ బృందం ) చేపట్టింది. ఉదయమే ఆలేరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న సిట్ బృందం ఉదయం 7.30గంటల నుండి మధ్యాహ్నం 2.30గంటల వరకు వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎన్‌కౌంటర్ జరిగిన బస్సును సుమారు 3గంటల పాటు పరిశీలించారు. స్థానిక ఎస్సై నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విచారణ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లకు బయటి వ్యక్తులను, మీడియాను అనుమతించలేదు. కనీసం ఫొటోలు కూడా తీసుకోనివ్వలేదు. ఐజీ సందీప్‌శాండిల్యా, ఖమ్మం ఎస్పీ షాన వజ్‌ఖాసీం, మాదాపూర్ ఐజీ రవికుమార్, హుమాయూన్‌నగర్ సీఐ రవీందర్, వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ రాజవెంకట్‌రెడ్డితో పాటు భువనగిరి డీఎస్పీ మోహన్‌రెడ్డి, యాదగిరిగుట్ట సీఐ రఘవీర్‌రెడ్డి, ఆలేరు ఎస్సై రాఘవేందర్ పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top