చికెన్, ఎగ్ మేళా నేడే


హైదరాబాద్: బర్డ్‌ఫ్లూ కారణంగా గుడ్లు, చికెన్ అమ్మకాలు పడిపోవడంతో పౌల్ట్రీ సంఘాల్లో కదలిక వచ్చింది. బర్డ్‌ఫ్లూపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు, సందేహాలను తొలగించేందుకు చికెన్ అండ్ ఎగ్ మేళా పేరుతో మంగళవారం ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. సాయంత్రం 7 గంటలకు నిజాం కాలేజీ మైదానంలో జరిగే ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకానున్నట్టు తెలంగాణ పౌల్ట్రీ లీడర్స్ అసోసియేషన్ వెల్లడించింది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top