ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి బైఠాయింపు

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి బైఠాయింపు

ధర్మారం(ధర్మపురి):  పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. మూడేళ్లు సహజీవనం చేసి మోసం చేశాడని పేర్కొంటూ ఓ యువతి ప్రియుడి ఇంటిఎదుట బైఠాయించింది. బాధితురాలి కథనం ప్రకారం.. ధర్మారం మండలం మేడారం గ్రామానికి చెందిన గుమ్ముల సుమలతకు ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. వారి మద్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అదే సమయంలో అదే గ్రామానికి చెందిన ఎండీ.సలీంతో సుమలతకు పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో సుమలత నమ్మింది.



కరీంనగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకుని దాదాపు 16 నెలలు సహజీవనం కొనసాగించారు. దీంతో సుమలత పాపకు జన్మనించింది. పాప పుట్టిన నాలుగు నెలల  అనంతరం సలీం ఓ ముస్లిం యువతిని పెళ్లిచేసుకున్నాడు. దీంతో సుమలత నిలదీయడంతో ఇద్దరితోనూ ఉంటానన్నాడు. ఆర్నెళ్ల క్రితం కరీంనగర్‌ నుంచి పెద్దపల్లికి మకాం మార్చారు. అప్పటి నుంచి సుమలత ఇంటికి రావటం మానేశాడు. ఖర్చులకు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.



ప్రసుత్తం తొమ్మిది నెలల గర్భవతి అయిన తనకు న్యాయం చేయాలని కోరుతూ కూతురు సోనితో కలిసి సలీం ఇంటికి రాగా దుర్భషలాడాడని, కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగే వరకూ ఇక్కడే ఉంటానని తేల్చిచెప్పింది. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top