కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనపై చార్జ్‌షీట్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనపై చార్జ్‌షీట్‌ - Sakshi


పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌



వరంగల్‌: వచ్చే నెల 1న సంగారెడ్డిలో జరగనున్న తెలంగాణ ప్రజాగర్జన సభలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మూడేళ్ల పాలనపై చార్జ్‌షీట్‌ను విడుదల చేస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హన్మకొండలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును ఎండగట్టేందుకు సంగారెడ్డిలో తెలంగాణ ప్రజా గర్జన పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తు న్నట్లు తెలిపారు.



ఈ సమావేశానికి హాజరయ్యే రాహుల్‌2019లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అమలుచేసే పథకాలను ప్రకటిస్తారన్నారు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ వర్ధంతి సందర్భంగా.. ఉత్తమ్‌ వరంగల్‌ ఎంజీఎం సమీపంలోని రాజీవ్‌గాంధీ విగ్రహంతో పాటు డీసీసీ భవన్‌లో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top