శంషాబాద్ లో చైన్ స్నాచింగ్


శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా) :  శంషాబాద్ మండలంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వాసితుల కాలనీలో గురువారం ఉదయం చైన్ స్నాచింగ్  జరిగింది. బబ్బురు ప్రమీల అనే మహిళ దృష్టి మరల్చి మెడలో ఉన్న 5 తులాల బంగారు గొలుసును బైకుపై వచ్చిన ఇద్దరు యువకులు లాక్కెళ్లారు. ఈ ఘటనలో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top