శతాధిక వృద్ధురాలు మృతి
వెల్దుర్తి: నూట రెండు సంవత్సరాలు నిండిన వృద్ధురాలు కిష్టమ్మ శనివారం ఉదయం మృతి చెందింది. మండలంలోని మాసాయిపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు కదిరె నర్సింహారెడ్డి తల్లి కిష్టమ్మకు ఎనిమిది నెలల క్రితం పాలపల్లు వచ్చాయి. కిష్టమ్మ ఆరు నెలల క్రితం వరకు అందరినీ పిలిచేదని, కేవలం చూపు మాత్రమే మందగించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలికి మునిమనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఆమెకు క న్నీటి వీడ్కోలు పలికారు.