కీసరలో కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి
మేడ్చల్: జిల్లాలోని కీసర మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలోని జ్యోతిరావు పూలె బీసీ గురుకుల పాఠశాలను శుక్రవారం కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ సందర్శించారు. పాఠశాల్లోని వసతులు, విద్యాబోధన, భోజనానికి సంబంధించిన వివరాలు అడిగి పరిశీలించారు. చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడి వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు.