సెల్ ఫోన్ చార్జింగ్ పెడుగూ మహిళ మృతి


యాచారం: సెల్‌ఫోన్‌ను చార్జింగ్ నుంచి తీస్తుండగా విద్యుద్ఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందింది.  ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మంతన్‌గౌరెల్లిలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన కనక మంజుల(25) సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లో సెల్‌ఫోన్‌ను చార్జింగ్ నుంచి తీసేందుకు యత్నించింది. ఈ క్రమంలో ఆమె కరెంట్ షాక్‌కు గురై మృతి చెందింది. మృతురాలికి భర్త ఎల్లయ్య, కుమారుడు క్రాంతి, కూతురు ప్రవళిక ఉన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top