సిరుల మాగాణి.. సింగరేణి

సిరుల మాగాణి.. సింగరేణి - Sakshi


నేడు 126 ఏళ్ల సంబరాలు

తట్టాచెమ్మస్ నుంచి ఆధునిక యంత్రాల దాకా  


 

సింగరేణి.. నిలువెల్లా నల్లబంగారంతో తులతూగుతోంది. కార్మికులకు వరప్రదాయినిగా వర్ధిల్లుతోంది. యావత్తు తెలంగాణకు కల్పవల్లిగా భాసిల్లుతోంది.  నాలుగు జిల్లాల్లో విస్తరించిన బొగ్గు గనులతో సిరుల పంట పండిస్తోంది. తట్టాచెమ్మస్ వాడక ం నుంచి.. అధునాతన అడ్రియాల గని ప్రారంభించే దాక ఎదిగిందీ సంస్థ. బ్రిటిష్ కాలంలో పురుడుపోసుకున్న సింగరేణి.. నూటాపాతిక వసంతాలు పూర్తి చేసుకుంది. తెలంగాణ రాష్ర్టంలో ఇవి తొలి వార్షికోత్సవాలు. ఈ 126వ వార్షికోత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనం..    - భూపాలపల్లిరూరల్

 

కాకతీయ రాజుల ప్రతీకగా కేటీకే


 

అతివేగంగా పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లి సింగరేణి గనులు జిల్లాకు తలమానికంగా నిలుస్తున్నాయి. కాకతీయ రాజుల వీరత్వానికి ప్రతీకగా భూపాలపల్లిలో కాకతీయ గనుల పేరుతో కేటీకే 1వ గనిని 1988 జూలై 15న అప్పటి సీఎం ఎన్టీ రామారావు ప్రారంబించారు.

 

1991-1992లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైంది. కేటీకే 2, 5, 6, లాంగ్‌వాల్ ప్రాజెక్ట్, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్‌లు విస్తరింంచారు.

7008 మంది కార్మికులు పనిచేస్తూ రోజుకు 10వేల టన్నుల బొగ్గు వెలికి తీస్తున్నారు.

 

ఏరియాలోని కేటీకే 2వ గనిలో పూర్తి స్థాయిలో యాంత్రీకరణతో బొగ్గు వెలికి తీస్తుండగా కేటీకే 1, 5, 6 గనుల్లో కొన్ని ప్రదేశాల్లో నేటికి కోల్ ఫిల్లర్లతో బొగ్గు వెలికి తీస్తున్నారు.  భూపాలపల్లి పక్కనే ఉన్న తాడిచర్లలో రెండు ఉపరితల గనులు రానున్న రోజుల్లో బొగ్గు ఉత్పత్తి చేయనుంది.  

 

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల పరిధిలోని గోదావరినది లోయ పరీవాహక ప్రాంతంలో విస్తరించింది సింగరేణి. వేలాది మందికి ప్రత్యక్షంగా.. లక్షలాది మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధిలో భాగస్వామ్యమవుతోంది.

 

సంస్థ ప్రస్థానం..    

 

1871లో ఖమ్మం జిల్లా భద్రాచలం అ టవీ ప్రాంతంలో దొరికిన బొగ్గురాళ్లపై కింగ్ జార్జ్ అనే శాస్త్రవేత్త ఆధ్వర్యంలో ఇంగ్లండ్‌లో పరిశోధనలు జరిపారు.

     

1886లోబొగ్గు నిక్షేపాలు కనుగొన్నారు.

1889 నుంచి ఇల్లందు సమీపంలోని సింగరేణి గ్రామంలో బొగ్గుగని తవ్వి ఉత్పత్తి పనులు ప్రారంభించారు.

పై నాలుగు జిల్లాల్లో 16 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు, 32 భూగర్భ గనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి కొనసాగుతోంది.

1920 డిసెంబర్ 23న హైదరాబాద్ డక్కన్ కంపెనీని ‘సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్’గా లండన్ స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లో పేరు మార్పు చేశారు.

1945లో హైదరాబాద్ సంస్థాన పాల కుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ సింగరేణి కాలరీస్ షేర్లను కొనుగోలు చేయగా సింగరేణి సంస్థ దేశంలోనే తొలి ప్రభుత్వ కంపెనీగా ఆవిర్భవించింది.

1949లో సింగరేణికాలరీస్ సంస్థ పూర్తి గా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లింది. కేంద్రరాష్ట్రాల వాటా 49: 51 శాతం.

 

సింగరేణికి ప్రతిబంధకాలు..

 

{పతీ టన్ను బొగ్గుకు ఉత్పత్తి వ్యయం పెరి గింది. కనీసంగా రూ. 650 నష్టం వస్తోంది.ఇండోనేషియా, ఆస్ట్రేలియా, అమెరికా, మొజాంబిక్, పోలండ్ తదితర దేశాల నుంచి వచ్చే బొగ్గు.. సింగరేణి నిర్ణయించే ధరకన్నా చౌక. విదేశీ బొగ్గుకే గిరాకీ ఉంది. పలు ప్రాజెక్టుల ప్రారంభానికి అటవీ, పర్యావరణ శాఖల నుంచి అనుమతులు లభించడం లేదు. భూసేకరణకు ప్రజా సహకారం అందట్లేదు. ఆర్‌అండ్‌ఆర్ పథ కం వర్తింపు కూడా సమస్యగా మారింది.భూగర్భగనులు, లాంగ్‌వాల్, బ్లాస్టింగ్ గ్యాలరీల్లో ఉత్పత్తికి అనుమతులందట్లేదు. గనులు, ఓసీపీల్లో యంత్రాల జీవిత కాలం పూర్తయి.. ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది.

 

సంస్కరణలతో వచ్చిన మార్పులు...

 


1991లో వచ్చిన సంస్కరణలు సింగరేణిపై తీవ్ర ప్రభావం చూపాయి. కార్మికుడు రిటైర్డయితే ఆయన వారసుడికి ఉద్యోగం ఇవ్వాలనే నిబంధన తొలగించారు.

భూగర్భ గనుల్లో తట్టాచెమ్మస్ ద్వారా బొగ్గు ఉత్పత్తి నిలిపివేస్తూ యాంత్రీకరణను వేగవంతం చేశారు.

2000-01లో 32 వేల మంది కోల్‌ఫిల్లర్ కార్మికులండగా... నేడు వారి సంఖ్య 5 వేలకు పడిపోయింది.  

ఐఏఎస్ అధికారి ఏపీవీఎన్ శర్మ సింగరేణి సంస్థ సీఎండీగా ఉన్నప్పుడు సంస్థను పూర్తిగా ప్రక్షాళన చేశారు.

వాలంటరీ రిటైర్డ్‌మెంట్ స్కీమ్(వీఆర్‌ఎస్)ను తెచ్చి కొంత మొత్తాన్ని వారికి అందిస్తూ కార్మికుల సంఖ్య కుదించారు.

 

సింగరేణికి కలికితురాయి ‘అడ్రియాల’

 

సింగరేణి ప్రతిష్టాత్మకంగా రామగుండం ఏరియాలో అడ్రియాల వద్ద పంచ్‌ఎంట్రీ గనిని ప్రారంభించింది. సుమారు రూ. 1400 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టారు.జర్మనీకి చెందిన క్యాటర్‌పిల్లర్ సంస్థ సాంకేతిక పరిజ్ఞానంతో భూగర్భంలో 400 మీటర్ల లోతులో బొగ్గును సర్ఫెర్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షిస్తూ వెలికితీస్తారు. ఏటా 2 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీత ఈ గని లక్ష్యం.

 

విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి...

 

సింగరేణి సంస్థ కొత్తగూడెం, గోదావరిఖనిలో 18 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు నిర్వహిస్తున్న సంస్థ ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద 1200 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించింది.దీనిని 2016లో ప్రారంభించి తెలంగాణ రాష్ట్రానికి 85 శాతం విద్యుత్‌ను అందించేందుకు చర్యలు తీసుకుంటోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top