గో మాంసం తరలిస్తున్న వాహనాలు స్వాధీనం


నిజామాబాద్: గో మాంసాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాలను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఈ సంఘటనలో పోలీసులు రెండు డీసీఎమ్‌లు, మూడు ట్రాలీ ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.


జాతీయ రహదారి 44పై వెళ్తున్న ఈ వాహనాలను పోలీసులు ఇందల్‌వాయి గ్రామ సమీపంలో గుర్తించారు. ఈ మాంసాన్ని నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు వివరించారు. ఈ వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top