కత్తితో దాడి: ముగ్గురిపై కేసు
మిర్యాలగూడ టౌన్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సుందర్నగర్లో బుధవారం అర్ధరాత్రి స్నేహితుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన బబ్లూ ఇంట్లో పుట్టిన రోజు వేడుకకు హజరైన లక్ష్మణ్, నవీన్, సురేష్, శివలు ఘర్షణ పడ్డారు. లక్ష్మణ్పై నవీన్, సురేష్, శివలు కత్తితో దాడి చేయగా గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు గురువారం నవీన్, శివ, సురేష్లను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు వన్ టౌన్ ఎస్ఐ సతీష్కుమార్ తెలిపారు.