నాయిని కాన్వాయ్ లో ప్రమాదం


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కాన్వాయ్ లో గురువారం ప్రమాదం జరిగింది. వాహనశ్రేణిలోని కార్లు ఒకదాన్నొకటి ఢీ కొన్నాయి. దీంతో కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి.



బంజారాహిల్స్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న టీఆర్ఎస్ నాయకుడు ముఠాగోపాల్ స్వల్పంగా గాయపడ్డారు. ఆయనను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top