రోడ్డు ప్రమాదంలో కార్పెంటర్ మృతి
తిరుమలగిరి: రోడ్డు ప్రమాదంలో కార్పెంటర్ మృతి చెందాడు. ఈ ఘటన తిరుమలగిరి మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది.వివరాలు.. మండలంలోని మాలిపురం గ్రామానికి చెందిన యెల్సోజు రామాచారి(39) మండల కేంద్రంలో కార్పెంటర్గా పనిచేస్తున్నాడు. పని ముగించుకున్న రామాచారి తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళుతుండగా అదుపుతప్పి స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాల బస్సును ఢీ కొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు భార్యలు, కుమార్తె, కుమారుడు ఉన్నారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ రాజు సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.