ఔటర్‌ రింగురోడ్డుపై కారు దగ్ధం

ఔటర్‌ రింగురోడ్డుపై కారు దగ్ధం - Sakshi


పటాన్‌చెరు : సంగారెడ్డి జిల్లాలో ఔటర్‌ రింగురోడ్డుపై ప్రమాదం చోటుచేసుకుంది. పటాన్‌చెరు సమీపంలోని కొల్లూరు-ఇంద్రారెడ్డినగర్‌ వద్ద ఆదివారం మధ్యాహ్నం ఓ కారులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి.



గుడిమల్కాపూర్‌ నుంచి ఏడుపాయలకు వెళ్తున్న సమయంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన కారులోని ప్రయాణికులు ఒక్కసారిగా బయటకు దిగారు. కొన్ని సెకన్లలోనే మంటలు భారీగా వ్యాపించి కారు పూర్తిగా దగ‍్ధమైంది. ఈ ప్రమాదంలో కారులోని ఆరుగురు ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది. ప్రమాదానికి గల కారణాలతో పాటు ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top