కారు బోల్తా.. మహిళ మృతి
కొడంగల్: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ శివారులో ఆదివారం మధ్యాహ్నం జరిగింది.
హైదరాబాద్ నుంచి గుల్బర్గా వెళ్తున్న కారు కొడంగల్ శివారులో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో కారులో ఉన్న కర్ణాటకకు చెందిన మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.