రాజధానిలో ఆర్టీఏ ఉద్యోగి కలకలం
బార్లో మద్యం తాగుతూ సంతకాలు చేస్తున్నారని ఛానల్స్లో ప్రసారం
నిజామాబాద్ కల్చరల్ : నిజామాబాద్ ఆర్టీఓ కార్యాలయం ఉద్యోగి ఒకరు గురువారం రాత్రి హైదరాబాద్లోని ఒక బార్లో ఏజెంట్తో మద్యం తాగుతూ మీడియా దృష్టిలో పడటం జిల్లాలో కలకలంరేపింది. సెలవులో ఉన్న హరిప్రసాద్ అనే ఉద్యోగి హైదరాబాద్లోని ఒక బార్లో ఆర్టీఏ కార్యాలయ ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారని మీడియా లో దుమారం రేగింది. ఆయన బార్ నుంచి పరుగులు తీసిన సన్నివేశాలను టీవీ చానెళ్లలో చూసినవారు అవాక్కయ్యారు.
హైదరాబాద్లో నే నివాసముండే హరిప్రసాద్ గత రెం డు నెలలుగా సెలవులో ఉన్న ట్లు సమాచారం. ఆయనకు కార్యాలయంలో అంతగా ప్రాధాన్యత ల భించకపోవడంతో ఈ నెల 28 వరకు సెలవుపెట్టినట్లు తెలియవచ్చింది. సెలవులో ఉండి నిజామాబాద్కు చెందిన ఏజెంట్తో బార్లో మం దు తాగుతూ కార్యాలపు ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారని ఛానల్లో ప్ర సారమైంది. ఈ విషయమై హరిప్రసాద్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతూ తాను తన తల్లి ఆరోగ్యం బాగాలేనందున, ఆఫీసులో ప్రతికూ ల పరిస్థితులు నెలకొన్నందున రెండు నెలలపాటు సెలవు పెట్టానని చె ప్పారు.
గురువారం నిజామాబాద్ కన్సల్టెంట్ ఒకరు తనను కలిసేం దుకు వస్తే తాము బార్కు వెళ్లామన్నారు. అక్కడ తమను ఛానల్స్వా రు కెమెరాతో చిత్రీకరించారని, దీంతో తాను బార్ నుంచి బయటకు వెళ్లానని చెప్పారు. తాను కార్యాలయపు ఫైళ్లపై ఏమాత్రం సంతకాలు చేయలేదని చెప్పుకొచ్చారు. ఈ విషయమై డీ టీ సీ రాజారత్నంను రాత్రిని వివరణ కోరగా, హరిప్రసాద్ ప్రస్తుతం సెలవులో ఉన్నారని చెప్పారు. ఇక్కడి కార్యాలయం ఫైళ్లను తెప్పించుకొని సంతకాలు చేశారనే విషయంపై సమగ్ర విచారణ జరుపుతామన్నారు. వాస్తవమని తేలితే, శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు