త్వరలో మంత్రివర్గ విస్తరణ: గవర్నర్ తో కేసీఆర్!

త్వరలో మంత్రివర్గ విస్తరణ: గవర్నర్ తో కేసీఆర్! - Sakshi

హైదరాబాద్: త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ గవర్నర్‌ నరసింహన్ కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనప్రాయంగా తెలిపారు. మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని తిరిగి టీఆర్ఎస్ గెలిచిన అంశాన్ని గవర్నర్‌తో కేసీఆర్ పంచుకున్నారు. 

 

మంగళవారం సాయంత్రం జరిగిన భేటిలో మరో 2నెలలకు ఓటాన్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆమోదించాల్సిందిగా రాజ్‌భవన్‌కు పంపిన ప్రతిపాదనలను గవర్నర్‌ నరసింహన్‌ దృష్టికి సీఎం కేసీఆర్‌ తీసుకువచ్చినట్టు సమాచారం. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top