‘బైక్ను ఢీకొన్న బస్సు’
సిద్ధిపేట: సిద్ధిపేట రూరల్ మండలం పొన్నాల్ వద్ద రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులను వెనక నుంచి వచ్చి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొండపాక మండలం రాంపల్లికి చెందిన బాల్రెడ్డి, రాంరెడ్డి అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.