అశ్వాపురంలో అక్కాతమ్ముడు అదృశ్యం..
ఖమ్మం(మామిళ్లవాయి): అక్కాతమ్మడు అదృశ్యమైన ఘటన ఖమ్మం జిల్లాలోని అశ్వాపురం మండలం మామిళ్లవాయిలో ఆదివారం వెలుగుచూసింది. మూడు రోజుల క్రితం తమ పిల్లలిద్దరూ అదృశ్యమైనట్టు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అయితే తమ పిల్లలు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.