జువైనల్ హోం నుంచి బాలుడు పరారీ


సైదాబాద్ (హైదరాబాద్) : సైదాబాద్‌లోని జువైనల్ హోం నుంచి ఓ బాలుడు తప్పించుకున్నాడు. ఈ ఘటన ఆదివారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం బూర్లపాడుకు చెందిన ఓ బాలుడి(16)ని స్థానిక పోలీసులు ఓ కేసు విషయంలో అదుపులోకి తీసుకుని సైదాబాద్ జువైనల్ హోంకు అప్పగించారు.



కాగా గత నెల 30న పరిశీలన గృహంలో భోజనం చేయడానికి బాలలు ఆవరణలోకి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఆ బాలుడు గోడ దూకి పరారయ్యాడు. దీనిపై పరిశీలన గృహం సూపరింటెండెంట్ రామచంద్రమూర్తి సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై రాష్ట్ర బాలుర సంస్కరణల, సంక్షేమశాఖ విచారణ చేపట్టింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top