బావిలోపడి బాలుడు మృతి
ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా పాత తాండూరులోని నిజాంశాహీ బావిలో శుక్రవరాం ఈ ఘటన జరిగింది. స్థానికంగా నివసిస్తున్న12 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి బావిలో పడి మృతిచెందాడు..
ఇది గమనించిన కొందరు స్థానికులు బావిలోని నీటిని తోడటానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. రాత్రి మోటర్ సాయంతో బావిలోని నీరు పూర్తిగా తీసేయడంతో బాలుడి మృతదేహం లభ్యమయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసున్నారు.