మంత్రులే బెదిరిస్తున్నారు....

మంత్రులే బెదిరిస్తున్నారు.... - Sakshi


హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోకుండా కాలయాపన చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. రెండు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించటం లేదని ఆయన బుధవారమిక్కడ అన్నారు. ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలను మంత్రులే బెదిరిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కోర్టు ఆర్డర్స్ను కూడా ప్రభుత్వం ధిక్కరించిందని ఆయన పేర్కొన్నారు. ఆస్తి పన్ను పెంపును నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద గురువారం బీజేపీ ఎమ్మెల్యేలు ఒకరోజు దీక్ష చేపట్టనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే..ప్రజలు షాక్ ఇస్తారని ఆయన అన్నారు. ఇక కాంగ్రెస్ తలతోక లేని పార్టీ అని, ఆ పార్టీ నేతల విమర్శలకు స్పందించమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top