జింకల వేట కేసులో ఎవరినీ వదలొద్దు

జింకల వేట కేసులో ఎవరినీ వదలొద్దు - Sakshi


పీసీసీఎఫ్‌కు బీజేపీ ఎమ్మెల్యేల విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: భూపాలపల్లి జిల్లాలో జరిగిన జింకల వేట విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (పీసీసీఎఫ్‌) పీకే ఝాకు బీజేపీ ఎమ్మెల్యేలు జి.కిషన్‌రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం పీసీసీఎఫ్‌ కార్యాలయంలో ఝాను వారు కలిశారు. ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేయొద్దని కోరారు.


ఇదే అంశంపై డీజీపీ అనురాగ్‌శర్మను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఫారెస్ట్‌ అధికారులను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసులో తగిన ఆధారాలున్నందున టీఆర్‌ఎస్‌ జెడ్పీటీసీపై చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన మంత్రుల కుమారులను ఎందుకు వదిలిపెట్టారని ప్రశ్నించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top