బీజేపీ అభ్యర్థి రామచంద్ర రావు ఘనవిజయం
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో పట్టుభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి దేవీ ప్రసాద్ ఓడిపోయారు.
రామచంద్ర రావుకు పదివేలకు పైగా ఓట్ల మెజార్టీ వచ్చింది. రామచంద్ర రావు తొలి రౌండ్ నుంచి ఆధిక్యతలో ఉన్నారు.