బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ప్రకటన
హైదరాబాద్: తెలంగాణ శాసన మండలికి జరిగే ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా రామచంద్రరావును బరిలో దింపింది. అలాగే వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా కె రామ్మెహన్ రావును ఎంపిక చేసింది.