ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న బీడీ కార్మికులు


మెదక్ : తెలంగాణ ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను బీడీ కార్మికులు శనివారం అడ్డుకున్నారు. మెదక్ జిల్లా కాశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీడీ కార్మికులు.. ముఖ్యమంత్రి కాన్వాయ్ తమ గ్రామం మీదుగా వెళ్తుందని తెలుసుకుని అక్కడే బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ వారి వద్దకు వెళ్లగా..తమకు పింఛన్‌లు రావటంలేదని కార్మికులు మొరపెట్టుకున్నారు. సానుకూలంగా స్పందించిన సీఎం.. వారికెలాగైనా పింఛన్ వచ్చే విధంగా చూడాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top