డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా భూమారెడ్డి
హైదరాబాద్:
తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా లోక భూమారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం నియమించారు. భూమారెడ్డి టీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నారు. గతంలో ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్గా, 15 ఏళ్ల పాటు సర్పంచ్గా కూడా ఆయన పనిచేశారు.