'కేసీఆర్ కుటుంబం హవా నడుస్తోంది'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం హవా నడుస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అన్నారు. వారికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించే రోజు వస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం దోపిడీకి గురవుతోందని విక్రమార్క విమర్శించారు. దోపిడీ చేస్తున్నదొంగల వివరాలు త్వరలో వెల్లడిస్తానని చెప్పారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మోసపూరిత హామీలతో అధికారాన్ని దక్కించుకున్నారని విక్రమార్క ఆరోపించారు. చత్తీస్గఢ్ నుంచి కరెంట్ తీసుకువస్తానన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని విక్రమార్క ప్రశ్నించారు.
మరిన్ని వార్తలు