నేటి నుంచి నేతకాని బతుకమ్మ


సీతంపేట(హసన్‌పర్తి) : హసన్‌పర్తి మండలం సీతంపేటలో నేతకాని బతుకమ్మ ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. నేతకాని కులస్తులు మాత్రమే నిర్వహించే ఈ వేడుకలు దీపావళి పర్వదినం నుంచి మూడు రోజులపాటు జరుగుతాయి. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులంతా ఉపవాస దీక్షలో ఉం టారు. రాష్ర్టంలో నేతకాని కులస్తులు ఎక్కడ ఉన్నా ఈ ఉత్సవాలకు ఇక్కడికి రావాల్సిందే.

 

తొలిరోజు



దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నేతకాని కులానికి చెందినవారు స్థానిక చెరువుకు వెళ్లి మట్టి సేకరిస్తారు. అ మట్టిని ఇంటికి తీసుకొచ్చి దేవుడి ప్రతిమలు(ఎద్దులు) తయారు చేస్తారు. ఆ ప్రతిమలను ప్రత్యేక గదిలో ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తారు.

 

రెండో రోజు



రెండోరోజు గంగ వ్రతం చేస్తారు. కుటుంబ సభ్యులు ఉపవాస దీక్షలో ఉంటారు. సాయంత్రం దేవుడి ప్రతిమలను ప్రత్యేక పాత్రలో ప్రతిష్టించి మగవారు భారీ ఊరేగింపుగా పాటలు పాడుతూ బయల్దేరుతారు. ఊరేగింపులో యువకుల కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సమీపంలోని సలాం చెరువులో అక్కడ దేవుడిని(ఎద్దులను) నిమజ్జనం చేస్తారు. అనంతరం పలురకాల పూలు కోసుకుని ఇంటికి వస్తారు.  

మూడో రోజు



మగవారు తీసుకొచ్చిన పూలతో మహిళలు బతుకమ్మలను అందంగా పేర్చి.. సాయంత్రం ప్రధాన వీధులగుండా ఊరేగింపుగా బ యల్దేరుతారు. ఇందులో మహిళలతోపాటు మగవారు కూడా కలిసి వెళ్లడం విశేషం. సమీపంలోని చెరువు వద్ద బతుకమ్మలు ఆడి నీళ్లలో నిమజ్జనం చేస్తారు. అనంతరం వ్రతా న్ని విరమించడంతో పండుగ ముగుస్తుంది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top