‘బాబు విధానాలను అనుసరిస్తున్న కేసీఆర్’
వినాయక్నగర్ : తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన విధానాలనే అనుసరిస్తున్నాడని వామపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు. నగరంలోని హమాల్వాడీలోని సీపీఐ ఎం జిల్లా కార్యాల యంలో శుక్రవారం విద్యుత్ అమరవీరులకు వారు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి పనులకు వేలాది కోట్ల రుణాలు కావాలని ప్రపంచ బ్యాంకు ఎదుట నిలబడిన ఏపీ సీఎం చంద్రబాబు మాదిరిగా తెలంగాణ సీఎం వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. 2008లో చలో హైదరాబాద్ నిర్వహించిన సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు కాల్పులు జరిపించిన ఘటనలో విష్ణువర్ధన్, బాలస్వామి, రామకృష్ణలు చనిపోవడం చరిత్ర మరిచిపోలేదని గుర్తు చేశా రు.
అయితే ఆ సంఘటన తెలంగాణ ప్రజలు మరవకముందే సీఎం కేసీఆర్ విద్యుత్, అభివృద్ధి పనుల కోసం రూ.58,500 కోట్ల రుణం కావాలని ప్రపంచ బ్యాం కును అప్పు అడగడం శోచనీయమన్నారు. ప్రజల బతుకులు ప్రపంచ బ్యాంక్కు తాకట్టు పెడితే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరిం చారు. కార్యక్రమంలో సీపీఐఎం జిల్లా కార్యదర్శి దండి వెంకట్, సీపీఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు బి. ప్రభాకర్, లిబరేషన్ జిల్లా నాయకుడు మల్లికార్జున్, న్యూడెమోక్రసీ నాయకుడు అభిలాష్, నాయకులు మల్యాల గోవర్ధన్, సిద్ధిరాములు, వెంకట్గౌడ్, కమలాపురం రాజన్న, సుధాకర్, గంగాధర్గౌడ్ పాల్గొన్నారు.