కీసరలో బీటెక్ విద్యార్ధిపై అత్యాచారం
కీసర: ఆస్పత్రికి తీసుకు వెళ్తానని నమ్మించి ఓ యువతిపై యువకుడు అత్యాచారం జరిపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలంలోని రాజీవ్ గృహకల్ప నివాస సముదాయం వద్ద చోటు చేసుకుంది.
బాధితురాలు బీటెక్ చదువుతున్నట్టు తెలిసింది. నిందితుడిని నరేష్ గా గుర్తించారు. బాధితురాలి కుటంబం ఫిర్యాదు మేరకు నరేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.