ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు


వెంకటాపురం (ఖమ్మం): ఖమ్మం జిల్లాలో రెండు ఆటోలు ఢీకొని ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. వెంకటాపురం నుంచి వాజేడు వెళ్తున్న ఆటోలో ఎనిమిది మంది ప్రయాణి స్తున్నారు. వీరిలో ఎస్‌పీ.బిందు(16), యాలం రవి(35) తీవ్రంగా గాయపడ్డారు. మిగతా ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  వెంకటాపురం వైపు వస్తున్న మరో ఆటోను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఆటో డ్రైవర్ మద్యం తాగి ఉండటమే ప్రమాదానికి కారణమైందని స్థానికులు వాపోతున్నారు.



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top