ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు
కొల్లాపూర్: మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. మండలంలోని మాచినేపల్లిలో ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మరోపక్క కొల్లాపూర్ మండలం యెన్నెంబెట్లలో అంబేద్కర్ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు.