చెట్టును ఢీకొట్టిన ఆటో..


జగిత్యాల: వేగంగా వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహానాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జగిత్యాల మండలంలోని కల్లెడ వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.


నిజామాబాద్‌ జిల్లా నడికుడికి చెందిన ఓ కుటుంబ సభ్యులు ధర్మపురి గోదావరిలో పుణ్యస్నానాలు చేసి వస్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top