రెండు ఆటోలు ఢీ.. ఒకరి మృతి
ఎనిమిది మందికి గాయాలు
సూర్యాపేట: ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సూర్యాపేట మండలం రాజానాయక్తండా శివారులో శనివారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో వారిని అంబులెన్స్ల సాయంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.