పట్టాలు తప్పిన హైదరాబాద్‌ ప్యాసింజర్

పట్టాలు తప్పిన హైదరాబాద్‌ ప్యాసింజర్


బెంగళూరు :  ఔరంగాబాద్ - హైదరాబాద్ ప్యాసింజర్ రైలు శుక్రవారం పట్టాలు తప్పింది. కల్గూపూర్‌-భీల్కీ రైల్వేస్టేషన్ల మధ్య ఈ రోజు ఉదయం రైలు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. కాగా ఆ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.



మరోవైపు రైలు ప్రమాద వివరాలను తెలుసుకునేందుకు రైల్వే శాఖ హెల్ప్‌ లైన్‌ నెంబర్లు ఏర్పాటు చేసింది.  ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపింది. హైదరాబాద్‌: 040-23200865, పర్లీ:  02446-223540,వికారాబాద్: 08416-252013 ‌, బీదర్‌: 08482-226329. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top