గుండెపోటుతో ఏఎస్ఐ మృతి
మంగపేట : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తోన్న దోబి.సారయ్య(57) గుండెపోటుతో మృతి చెందారు. వివరాలు.. సారయ్యది ములుగు మండలం రాయిగూడెం. గత వారం రోజులుగా సెలవులో ఉన్న సారయ్య శుక్రవారం విధులకు వెళ్లారు. అక్కడ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. స్థానిక ఎస్ఐ మహేందర్, సారయ్యను ఏటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందారు.