'కనీస వేతనం అమలు చేయాలి'
వరంగల్ జిల్లా : కనీస వేతనం అమలు చేయాలంటూ ఆరోగ్యశ్రీ సిబ్బంది శుక్రవారం వరంగల్ జిల్లా హన్మకొండ ఏకశిలా పార్కు ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఉద్యోగులుగా తమను గుర్తించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
ఆరోగ్యశ్రీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. వారికి కాంగ్రెస్ నేతలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గండ్ర వెంకటరమణా రెడ్డి, వివేక్ తదితరులు మద్దతు తెలిపారు.