ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఎదుట ఉద్రిక్తత
హైదరాబాద్: తమ సమస్యల పరిష్కరించాలని కోరుతూ గత వారం రోజులుగా ఆరోగ్యశ్రీ పొరుగు సేవల ఉద్యోగులు చేస్తున్న సమ్మెను మరింత ఉధృతం చేశారు. నగరంలోని బంజారాహిల్స్లో ఉన్న ఆరోగ్య శ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ భవనం ముందు ఆరోగ్య మిత్రాలు సోమవారం ఆందోళనలు చేపట్టారు. తమను ట్రస్టు ఉద్యోగులుగా గుర్తించి జీతాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ట్రస్టు భవనం ఎదుట పోలీసులను భారీగా మొహరించారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని ఉద్యోగులతో పాటు వివిధ జిల్లాలకు చెందిన ఆరోగ్య శ్రీ మిత్రాలు పాల్గొన్నారు.