కేజీబీవీలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం


మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లాలోని ఉప్పునూతల పరిధిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో 2015-16 సంవత్సరానికిగాను 6,7,8 తరగతుల్లో ప్రవేశానికి జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నామని కేజీబీవీ ప్రిన్సిపాల్ సంధ్యారాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని గ్రామాల్లో ఆర్థిక ఇబ్బందులతో చదువు మధ్యలో మానేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఆమె పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top