సాగర్ జలాల కోసం మరో ఉద్యమం: పొంగులేటి

సాగర్ జలాల కోసం మరో ఉద్యమం: పొంగులేటి - Sakshi


 వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి

 సాక్షిప్రతినిధి, ఖమ్మం: సాగర్ జలాలను ఖమ్మం జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు అందించాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మరో ఉద్యమానికి సిద్ధమవుతోందని పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కిగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మంగళవారం ఆయన ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్‌తోపాటు పలు ప్రాంతాలు పరిశీలించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి ఏరకమైన ప్రాధాన్యం ఇస్తారో.. వ్యవసాయానికి కూడా అదేరీతిలో సాగునీరు ఇవ్వాలన్నారు. రైతుల కన్నీరు తుడవకుండా ఏ అభివృద్ధి చేసినా నిష్ర్పయోజనమేనని అన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును నేరుగా కలిసి రైతుల సమస్యలను వివరిస్తామని చెప్పారు. సాగర్ జలాలతో వైరా రిజర్వాయర్‌ను నింపాలని కోరారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top