వైఎస్సార్‌సీపీఎల్పీ నేతగా పాయంను ప్రకటించాలి


హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ పక్ష నేతగా పాయం వెంకటేశ్వర్లును వెంటనే ప్రకటించాలని అసెంబ్లీ కార్యద ర్శి రాజా సదారాంకు వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు శుక్రవారం ఆయనకు పార్టీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేఖ రాశారు. పార్టీ ప్రధానకార్యదర్శి కె.శివకుమార్, పార్టీనేతలు నాయుడు ప్రకాశ్, బీష్వ రవీందర్ ఈ లేఖను సదారాంకు అందజేశారు. అసెంబ్లీ కార్యకలాపాలకు సంబంధించిన సమావేశంలో దీని అమలుపై చర్యలు తీసుకుంటామని కార్యదర్శి తెలిపినట్లు శివకుమార్ మీడియాకు చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top