విద్యుత్ తీగ తెగిపడి మూగజీవాల మృతి


చండ్రుగొండు : ఖమ్మం జిల్లా చండ్రుగొండు మండలం బాల్యాతండా శివారులో శుక్రవారం ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగ తెగిపడి నాలుగు మూగజీవాలు మృత్యువాత పడ్డాయి.


 


వేర్వేరు రైతులకు చెందిన రెండు ఆవులు, ఒక ఎద్దు, ఒక దూడ మేత మేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విద్యుదాఘాతానికి గురైన ఆ నాలుగు మూగజీవాలు అక్కడికక్కడే చనిపోయాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top