మహిళ ఆత్మహత్య
నల్లగొండ: ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పుంటించుకొని ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని బంగారుగడ్డలో ఆదివారం సాయంత్రం 5గంటలకు జరిగింది. వివరాలు.. నిడమనూరు మండలం తుమ్మడం గ్రామానికి చెందిన మందడి జానకి(40) నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో శరీరం పూర్తిగా కాలిపోయి మృతి చెందింది. ఆమె భర్త లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
(మిర్యాలగూడ)