అగ్రిసెట్ ఫలితాలు విడుదల
రాజేంద్రనగర్ (హైదరాబాద్) : వ్యవసాయ పాలిటెక్నిక్ (అగ్రిసెట్-2015) ప్రవేశ పరీక్ష ఫలితాలను మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ వి.ప్రవీణ్రావు విడుదల చేశారు. రెండేళ్ల వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఏజీ బీఎస్సీలో ప్రవేశం పొందడానికి అగ్రి సెట్ పరీక్షలో అర్హత తప్పనిసరి అని ఆయన తెలిపారు. వర్సిటీ పరిధిలోని ఏజీ బీఎస్సీ మొత్తం సీట్లలో వీరికి 15 శాతం కోటాలో సీట్లు లభిస్తాయన్నారు. అగ్రిసెట్ ఫలితాలను వర్సిటీ వెబ్ సైట్లో పొందుపరిచినట్లు వివరించారు.