జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలా...?
హైదరాబాద్ : వరంగల్ ఉపఎన్నికలో ఘోర పరాజయం మిత్రపక్షాలు బీజేపీ, టీడీపీలకు మింగుడు పడటం లేదు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టడం ద్వారా కొంతవరకైనా కోలుకోవచ్చని ఆ పార్టీలు భావిస్తున్నాయి. ఇరు పార్టీల మధ్య సమన్వయం లేకపోతే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ చేదు అనుభవం తప్పదని అంచనాకొచ్చాయి.
అందుకు ఇప్పటినుంచే కసరత్తు చేయాలని ఇరు పార్టీలు సంకల్పించాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల ముఖ్యులు శనివారం సమావేశమవుతున్నారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు కె లక్ష్మణ్, టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణలతో పాటు ఇరు పార్టీలకు చెందిన నేతలు శనివారం మధ్యాహ్నం సమావేశమవుతున్నారు.